నేనెవరినన్నా ఇన్సల్టు చెయ్యాలంటే వాళ్ళ టేస్టుని యెద్దేవాచేస్తానని సెలవిచ్చాడు మా రాకేస్వరుడు ఈ మధ్యనే ఏదో బ్లాగులో కామెంటుతూ. యేమి సత్యాన్ని ఆవిష్కరించినావయా, నువ్వు రాకు! అనుకున్నాను.
మీరే చూడండి. యెవర్నన్నా కెలకాలన్నా, కోపం తెప్పించాలన్నా ఇంతకన్నా మంచిమార్గం మరోటి లేదు. తన ఫేవరెట్ హీరోనో, బాగా నచ్చిన పాటనో యెవరన్నా వెక్కిరిస్తే లావాలా ఉప్పొంగుతుంది కోపం మనిషికి, తనని యెలాంటి దుర్భాషలాడినా రానిది.
ఈ టేష్టు, రుచి, అభిరుచి అనేవున్నాయి చూశారూ, మహా ఇబ్బంది వీటితో. ఒహపక్కన విపులాచ పృథ్వీ, లోకో భిన్న రుచిః అని సంస్కృతంలోనూ, మరొపక్కన డిగుస్టిబస్ నానెస్ట్ డిస్పుటాండం అని లాటినులోనూ నొక్కి వక్కాణించారు గదా. దీన్నే అచ్చ తెలుగులో పుర్రెకో బుద్ధీ, జిహ్వకోరుచీ అని అనువదించి మరీ చెప్పారాయె, మనలాంటి మందమతులకి అర్ధం కాదేమోనని. ఐనా సరే, మనం హేప్పీగా బీపీ పెంచేస్కుని రెచ్చిపోతుంటాం, వాళ్ళ టేష్టంతేలే అని చేతులు దులుపుకుని పోవాల్సిన చోటకూడా.
ఒకరు యిప్పటికింకా నావయసు నిండా పదహారే అని మురుసుకుంటే మరొకరు ఓంకారనాదాను సంధానమౌగానమే అని పరవశులవుతుంటారు. ఒకరు మధుబాబు షాడో అడుగుల్లో అడుగులేస్తుంటే మరొకరు రావిశాస్త్రి వియత్నాం విమలతో భేటీ అవుతుంటారు. ఒకరికి డిస్కో మరొకరికి భామాకలాపం, ఒకరికి రాంగోపాల వర్మ మరొకరికి సత్యజిత్ రే, ఒకరికి విశ్వనాథ మరొకరికి శ్రీశ్రీ .. వీరిని చూసి వారు నొసలు చిట్లించడం, వారిని చూసి వీరు జాలిపడ్డం. ఒకరెక్కువా? మరొకరు తక్కువా? రుచుల్లో ఎక్కువ తక్కువలా? తర తమ భేదాలా? ముమైత్ ఖాన్ ఐటం పాట చూసి పదహారేళ్ళ కుర్రాడు పొందే ఆనందం, వాడి తాత కచేరీలో నేదునూరి గారు పాడుతున్న త్యాగరాజకృతి వింటు పొందే ఆనందం కంటే ఏవిధంగా భిన్నం? ఏవరిదెక్కువ స్థాయి ఆనందమో తూకమేసి చెప్పగలవారెవ్వరు?
పోనీ ఒకేకళారూపాన్ని ఆస్వాదించడంలోనూ .. ఒకచోట భాగవత కథాగానం జరుగుతోంది. యెవరో మంచి గొంతున్న పౌరాణికులు శ్రావ్యంగా రాగయుక్తంగా చదువుతున్నారు పోతన పద్యాల్ని. "మందార మకరంద మాధుర్యమున దేలు మధుపమ్ము వోవునే మదనములకు". ఓ బామ్మగారు ఆ గాత్ర మాధుర్యానికే పరవశురాలవుతున్నది. ఒక తాతగారు అందులోని భక్తిభావానికి పులకితులవుతున్నారు. ఒక యువకుడు పద్యంలోని శబ్దాలంకారాలకి సమ్మోహితుడవుతున్నాడు. ఒక పండితుడు రసాస్వాదనలో మైమరిచాడు. ఒక యోగి అందులోని మార్మిక తత్త్వజ్ఞానానికి దాసోహమంటున్నాడు. ఇందులో ఎవరిది హెచ్చు స్థాయి ఆనందం? రాగతాళాలు యేమీ తెలియకపోయినా, బాలమురళీ గొంతు వినబడితేనే పరవశించిపోయే వారున్నారు. ఆలాపన వినగానే రాగాన్ని పోల్చుకుని, ఆహా వోహో అని ఆనందించే వారున్నారు, అంటకంటే విశేషమేమీ వారికి అంతుపట్టక పోయినా. వారి చెవులకి బాలమురళి పాడినా నేదునూరి పాడినా మోహన రాగమంటే మోహన రాగమే. అలాక్కాదు, రాగాన్ని విశదీకరించడంలో, గాయకుడు ఎలాంటి గమకాలు వాడాడు, ఏ ప్రయోగం బాగా ఫలించింది, ఏ ప్రయోగం కొత్తగా ఉంది, అని తెలిసి అనుభవించే శ్రోత ఉన్నాడు. ముగ్గురూ అదే సంగీతాన్ని అనుభవించి ఆనందిస్తున్నారు. మరి ఆ స్థాయిలో తేడాలేదూ?
నేను నటన జంధ్యాల గౌరీనాథశాస్త్రి
అప్పుడెప్పుడో నాగురించి నేను పువ్వు పుట్టగనే పరిమళించును అని చెప్పుకున్నా.
చాలా విషయాల్లో ఇది నిజమేకూడాను :)
కానీ నటన విషయంలో కాదు!
మన బ్లాగర్లలో చాలా మంది చిన్నప్పుడే చాలా కళలు తేరినవారున్నారు. పాఠశాల వార్షికోత్సవాలకి యేకపాత్రాభినయాలు చేసిన వారు, రేడీయో బాలానందంలో పాటలు పాడినవారు, బడులలో, కాలేజిలో, ఇతరత్రా, తమ ఆటపాటలతో అలరించినవారూ చాలా మందె వున్నారు.
కానీ నామట్టుకి నాకు యెంటెక్కుకి కాన్పూరుకెళ్ళేదాకా ఈ స్టేజి పురుగు కుట్టలేదు. కాన్పూరులోనైనా, చెట్లులేనిచోట ఆవదం చెట్టే మహావృక్షమనే సామెత మీకుగుర్తొస్తే మీతప్పేంలేదు. యేదేవైనా అక్కడున్న రెండేళ్ళూ అక్కడి తెలుగు సమితి వేదికని ఏకఛ్ఛత్రాధిపత్యంగా పరిపాలించినాక ఫిలడెల్ఫియా వచ్చిపడ్డాను.
యిక్కడొక చిన్న పిట్టకథ చెప్పుకోవాలి. ముందస్తుగా శిరాకదంబం వారందిస్తున్న ఈ దృశ్యకాన్ని తిలకించండి.
ఇది నాగయ్య నటించిన భక్త పోతన సినిమాలో ఒకదృశ్యం. కవిసార్వభౌముడు శ్రీనాథుని పాత్ర పోషించినది జంధ్యాల గౌరీనాథ శాస్త్రిగారని గొప్ప నటుడు. మా అమ్మమ్మ వేపునించి వీరితో యేదో బీరకాయపీచు చుట్టరికం కూడా ఉన్నట్టు మాఅమ్మ చెబుతుండేది. ఆయన స్వయంగా బాగా ఆస్తిపరుడు. డబ్బుకోసమని ఒకపని చెయ్యవలసిన అవసరం ఆయనకి లేదు. అందుకని, తన ప్రవృత్తి రీత్యా నాటకాలని సినిమాలని, అదీను తనకి నచ్చిన నప్పిన పాత్ర అయితేనే చేస్తూండేవారు. పెద్దమనుషులు సినిమాలో మ్యునిసిపల్ చెయిర్మన్ పాత్రని చాలా సమర్ధవంతంగా పోషించారు. నిలువెత్తు విగ్రహం, కొనదేరిన ముక్కు, తీర్చిదిద్దినట్టున్న ముఖం, పెద్దపెద్ద కళ్ళు, వొంటితీరులో ఒక సహజమైన రాజసం ఈయన సొత్తు.
మళ్ళీ అసలు కథకొద్దాం. ఫిలడెల్ఫియాలో మాకో పెద్దాయనున్నారు కోటపాటి సాంబశివరావుగారని. ఈయనకి మనతెలుగు గడ్డమీద, చింతామణి హరిశ్చంద్ర ఇత్యాది నాటకాల్లో నటించిన అనుభవముంది. పద్యాలు గుక్కతిప్పుకోకుండా పాడేవారు. ఇదిలాగుండగా, దగ్గర్లో న్యూయార్కునగరంలో తానా మహోత్సవం జరగబోతోందని వార్తలొచ్చాయి. మా వాళ్ళంతా సాంబశివరావుగార్ని .. హబ్బే మీ టేలెంటుకి మన చిన్నస్టేజి సరిపోద్సార్, తానా స్టేజిమీద చూపించాల్సిందే మీప్రతాపం అని యెగదోశారు. ఆయన పాపం నిజమే అనేసుకుని, నన్నూ, సీత అనే ఇంకో స్నేహితురాల్నీ కూడగట్టి, చింతామణి నాటకంలోని మొదటి దృశ్యం ప్రాక్టీసు చేయించారు. నాకు ఛస్తే పద్యం రాగయుక్తంగా పాడ్డం చేతగాదు. కానీ పాపం సాంబశివరావుగారు పనిగట్టుకుని నేనుండే ఎపార్టుమెంటుకొచ్చి మరీ నన్ను తోమి తోమి నాపాత్ర పాడాల్సిన ఒక్కపద్యం తర్ఫీదిచ్చారు.
నేను వేస్తున్న పాత్ర బిల్వమంగళుడి స్నేహితుడైన ఒక శ్రోత్రియ బ్రాహ్మణుడి వేషం (పాత్ర పేరు నాకిప్పుడు గుర్తులేదు). ఒకరోజు ఎందుకైనా మంచిదని పాత్రకి తగిన వేషం అంతా తయారుచేసుకుని అద్దంలో చూసుకుంటే మీసాల్తోనూ, తలకట్టు (క్రాపింగు)తోనూ ఆ రూపం ఆషాడభూతిలా ఉందిగానీ శ్రోత్రియ బ్రాహ్మణుడిలా లేదనిపించింది. అందుకని ప్రదర్శనకి మీసం తీసెయ్యడానికి నిశ్చయించాను. తలకి బోడిగుండులా కనబడే రబ్బరు తొడుగు సంపాయించి దానికి గోష్పాదమంత పిలకతోసహా తయారుగా ఉంచాను.
తీరా మా ప్రదర్శన శుభదినం రానే వచ్చింది. ఆ మహోత్సవాల్లో ఆఖరి రోజు. మా ప్రదర్శన ముఖ్యవేదిక మీద, సాయంత్రం ఎనిమిదింటికి .. అంటే ప్రైం టైమన్న మాట. మా సాంబశివరావుగారి ఉత్సాహానికి హద్దులేకుండా ఉంది. మేము సభాస్థలిని చేరుకుని, ఒక పచ్చగది (గ్రీన్రూము) వెతుక్కుని వేషధారణ మొదలు పెట్టాము. ఈ మహోత్సవాలకి ఇండియానించి దిగుమతయ్యి, తమగోడు ఎవరికీ పట్టక, కారిడార్లలో కాలుగాలిన పిల్లుల్లా తిరుగుతున్న ఒకబృందం మమ్మల్ని గమనించి, ఇక్కడేదో నాటకం తయారీ జరుగుతోందే అంటూ వచ్చి పలకరించారు. చింతామణి వేస్తున్ణామని తెలిసి మా సాంబశివరావుగారి ధైర్యాన్ని మెచ్చుకున్నారు. అంతే మా సాంబశివరావుగారు గాల్లో ఎగురుతున్నారు. వారిలో ఇద్దరు నా వేషధారణలో చాలా సాయం చేశారు. నా వేషం పూర్తయ్యాక వారిలో ఒక పెద్దాయన నన్ను కిందినించి పైదాకా తేరిపార చూసి, మీరు చాలా నాటకాలు వేశారా అనడిగారు. అబ్బే లేదండీ, నిజంగా నాటకం అంటూ వెయ్యడం ఇదే మొదలు అన్నాను. అలాగా, వేషం మాత్రం బ్రహ్మాండంగా కుదిరింది, పోతన సినిమాలో శ్రీనాథుడిలా ఉన్నారు అని ప్రశంసించారు. నేనూ మా సాంబశివరావుగారితో చేరి గాల్లో ఎగురుతున్నాను.
మా ప్రదర్శనకి టైమయిందని వేదిక వెనక్కి చేరుకున్నాం. మా ముందు జరుగుతున్న ప్రోగ్రాము యెంతకీ అవదు, వేచి వేచి, చూచి చూచి, కాళ్ళు పీకుతున్నాయి అనుకొనేంతలో స్టేజిమేనేజరొచ్చి, చింతామణి వాళ్ళెవరండీ అని కేకపెట్టాడు. మేమే అన్నాం. మీరే నెక్స్టు అన్నాడు. తెలుసు అన్నాం. మీ ప్రోగ్రామెంతసేపు అన్నాడు మాకేసి అనుమానంగా చూస్తూ. సాంబశివరావుగారు ఆల్రెడీ బిల్వమంగళుడిలో పరకాయ ప్రవేశం చేసేశారు - ఇలాంటి తుఛ్ఛమైన సంభాషణలు పట్టించుకునే స్థితిలో లేరు. ఆయన చెవుల్లో అప్పటికే ప్రేక్షకులు కొట్టే వన్స్ మోర్లు గింగురు మంటున్నాయి. అందుకని నేనే బాధ్యత తీసుకుని, ఆ యెంతసేపండీ, పదిహేన్నిమిషాలు అన్నా. ఐదునిమిషాల్లో ముగించండి అని చెప్పి ఆయన హడావుడిగా వెళ్ళిపోయాడు.
వెనక్కి తిరిగి చూసేప్పటికి స్టేజిమీద తెర తీసి వుంది. స్టేజి మధ్యలో కుర్చీల్లో సాంబశివరావుగారూ, సీతా కూర్చుని ఉన్నారు. సాంబశివరావుగారు మొదటి పద్యం అందుకున్నారు. నేను పక్కన వింగ్స్ లో నుంచుని చూస్తున్నా. ఎవరో నా భుజం గోకారు. స్టేజి మేనేజరు. ఇంకా ఎంతసేపండీ అన్నాడు అసహనంగా. అప్పటికి సరిగ్గా ఒక్క నిమిషం అయింది మావాళ్ళు స్టేజెక్కి. ఇదింకా మొదటి పద్యమేనండీ. ఇంకా నాలుగు పద్యాలున్నాయి అన్నా. ఇంతలో మా పెద్దాయన పద్యం ముగించి రాగాలాపన చేస్తున్నారు. నాపక్కన స్టెజి మేనేజరు బద్దలవడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలాగున్నాడు. ఎలాగైతేనేం మొదటి పద్యం, రాగాలాపనతో సహా పూర్తయింది. సీత తన డయలాగు చెప్పబోతోంది. ఇంతలో ఆడియన్సులోంచి ఎవరో తుంటరి వన్స్ మోర్ అని అరవనే అరిచాడు. మా సాంబశివరావుగారు అలా కూచున్న కుర్చీ పాళంగా ఆరంగుళాలు గాల్లోకి లేవడం స్పష్టంగా కనబడింది. ఆయన సీత డయలాగుని మధ్యలో తుంచేసి అదే పద్యం మళ్ళీ ఎత్తుకున్నారు. స్టేజిమేనేజరుకి ఇది గోరుచుట్టుమీద రోకటిపోటులాగ తగిలింది. తెరలు లాగెయ్యండి అని ఆజ్ఞ ఇచ్చాడు. నేనేదో చెయ్యాలి గబుక్కుని. పద్యం మధ్యలో తెరపడిపోతే సాంబశివరావుగారు భరించలేరు .. నాకు తగిలించిన క్లిపాన్ మైకు ఆన్ చేసుకుని గాఠిగా నా పద్యం పాడుకుంటూ ఎంటరైపోయాను. ఆ కంగారులో అపశ్రుతిలో యెత్తుకున్నానని వేరే చెప్పక్కర్లేదు. సాంబశివరావుగారు బ్రూటస్ వెన్నుపోటు తిన్న జూలియస్సీజర్లా నిర్ఘాంతపోయి నాకేసి చూస్తున్నారు. సీత అంతకు మునుపే స్పృహతప్ఫే స్థితిలో ఉంది. అదే అదనుగా స్టేజిమేనేజరు తెరలాగేశాడు.
కథ కంచికి. మేం ఫిలడెల్ఫియాకి.
తనకళకి జరిగిన అవమానాన్నించి తేరుకోడానికి సాంబశివరావుగారికి చాలా కాలం పట్టింది. కానీ నా వేషం చూసి ఆ పెద్దాయనెవరో గౌరీనాథశాస్త్రిగారి లాగున్నావని మెచ్చినందుకు నేను మాత్రం ఇప్పటికీ మురుసుకుంటూనే వుంటా!
చాలా విషయాల్లో ఇది నిజమేకూడాను :)
కానీ నటన విషయంలో కాదు!
మన బ్లాగర్లలో చాలా మంది చిన్నప్పుడే చాలా కళలు తేరినవారున్నారు. పాఠశాల వార్షికోత్సవాలకి యేకపాత్రాభినయాలు చేసిన వారు, రేడీయో బాలానందంలో పాటలు పాడినవారు, బడులలో, కాలేజిలో, ఇతరత్రా, తమ ఆటపాటలతో అలరించినవారూ చాలా మందె వున్నారు.
కానీ నామట్టుకి నాకు యెంటెక్కుకి కాన్పూరుకెళ్ళేదాకా ఈ స్టేజి పురుగు కుట్టలేదు. కాన్పూరులోనైనా, చెట్లులేనిచోట ఆవదం చెట్టే మహావృక్షమనే సామెత మీకుగుర్తొస్తే మీతప్పేంలేదు. యేదేవైనా అక్కడున్న రెండేళ్ళూ అక్కడి తెలుగు సమితి వేదికని ఏకఛ్ఛత్రాధిపత్యంగా పరిపాలించినాక ఫిలడెల్ఫియా వచ్చిపడ్డాను.
యిక్కడొక చిన్న పిట్టకథ చెప్పుకోవాలి. ముందస్తుగా శిరాకదంబం వారందిస్తున్న ఈ దృశ్యకాన్ని తిలకించండి.
ఇది నాగయ్య నటించిన భక్త పోతన సినిమాలో ఒకదృశ్యం. కవిసార్వభౌముడు శ్రీనాథుని పాత్ర పోషించినది జంధ్యాల గౌరీనాథ శాస్త్రిగారని గొప్ప నటుడు. మా అమ్మమ్మ వేపునించి వీరితో యేదో బీరకాయపీచు చుట్టరికం కూడా ఉన్నట్టు మాఅమ్మ చెబుతుండేది. ఆయన స్వయంగా బాగా ఆస్తిపరుడు. డబ్బుకోసమని ఒకపని చెయ్యవలసిన అవసరం ఆయనకి లేదు. అందుకని, తన ప్రవృత్తి రీత్యా నాటకాలని సినిమాలని, అదీను తనకి నచ్చిన నప్పిన పాత్ర అయితేనే చేస్తూండేవారు. పెద్దమనుషులు సినిమాలో మ్యునిసిపల్ చెయిర్మన్ పాత్రని చాలా సమర్ధవంతంగా పోషించారు. నిలువెత్తు విగ్రహం, కొనదేరిన ముక్కు, తీర్చిదిద్దినట్టున్న ముఖం, పెద్దపెద్ద కళ్ళు, వొంటితీరులో ఒక సహజమైన రాజసం ఈయన సొత్తు.
మళ్ళీ అసలు కథకొద్దాం. ఫిలడెల్ఫియాలో మాకో పెద్దాయనున్నారు కోటపాటి సాంబశివరావుగారని. ఈయనకి మనతెలుగు గడ్డమీద, చింతామణి హరిశ్చంద్ర ఇత్యాది నాటకాల్లో నటించిన అనుభవముంది. పద్యాలు గుక్కతిప్పుకోకుండా పాడేవారు. ఇదిలాగుండగా, దగ్గర్లో న్యూయార్కునగరంలో తానా మహోత్సవం జరగబోతోందని వార్తలొచ్చాయి. మా వాళ్ళంతా సాంబశివరావుగార్ని .. హబ్బే మీ టేలెంటుకి మన చిన్నస్టేజి సరిపోద్సార్, తానా స్టేజిమీద చూపించాల్సిందే మీప్రతాపం అని యెగదోశారు. ఆయన పాపం నిజమే అనేసుకుని, నన్నూ, సీత అనే ఇంకో స్నేహితురాల్నీ కూడగట్టి, చింతామణి నాటకంలోని మొదటి దృశ్యం ప్రాక్టీసు చేయించారు. నాకు ఛస్తే పద్యం రాగయుక్తంగా పాడ్డం చేతగాదు. కానీ పాపం సాంబశివరావుగారు పనిగట్టుకుని నేనుండే ఎపార్టుమెంటుకొచ్చి మరీ నన్ను తోమి తోమి నాపాత్ర పాడాల్సిన ఒక్కపద్యం తర్ఫీదిచ్చారు.
నేను వేస్తున్న పాత్ర బిల్వమంగళుడి స్నేహితుడైన ఒక శ్రోత్రియ బ్రాహ్మణుడి వేషం (పాత్ర పేరు నాకిప్పుడు గుర్తులేదు). ఒకరోజు ఎందుకైనా మంచిదని పాత్రకి తగిన వేషం అంతా తయారుచేసుకుని అద్దంలో చూసుకుంటే మీసాల్తోనూ, తలకట్టు (క్రాపింగు)తోనూ ఆ రూపం ఆషాడభూతిలా ఉందిగానీ శ్రోత్రియ బ్రాహ్మణుడిలా లేదనిపించింది. అందుకని ప్రదర్శనకి మీసం తీసెయ్యడానికి నిశ్చయించాను. తలకి బోడిగుండులా కనబడే రబ్బరు తొడుగు సంపాయించి దానికి గోష్పాదమంత పిలకతోసహా తయారుగా ఉంచాను.
తీరా మా ప్రదర్శన శుభదినం రానే వచ్చింది. ఆ మహోత్సవాల్లో ఆఖరి రోజు. మా ప్రదర్శన ముఖ్యవేదిక మీద, సాయంత్రం ఎనిమిదింటికి .. అంటే ప్రైం టైమన్న మాట. మా సాంబశివరావుగారి ఉత్సాహానికి హద్దులేకుండా ఉంది. మేము సభాస్థలిని చేరుకుని, ఒక పచ్చగది (గ్రీన్రూము) వెతుక్కుని వేషధారణ మొదలు పెట్టాము. ఈ మహోత్సవాలకి ఇండియానించి దిగుమతయ్యి, తమగోడు ఎవరికీ పట్టక, కారిడార్లలో కాలుగాలిన పిల్లుల్లా తిరుగుతున్న ఒకబృందం మమ్మల్ని గమనించి, ఇక్కడేదో నాటకం తయారీ జరుగుతోందే అంటూ వచ్చి పలకరించారు. చింతామణి వేస్తున్ణామని తెలిసి మా సాంబశివరావుగారి ధైర్యాన్ని మెచ్చుకున్నారు. అంతే మా సాంబశివరావుగారు గాల్లో ఎగురుతున్నారు. వారిలో ఇద్దరు నా వేషధారణలో చాలా సాయం చేశారు. నా వేషం పూర్తయ్యాక వారిలో ఒక పెద్దాయన నన్ను కిందినించి పైదాకా తేరిపార చూసి, మీరు చాలా నాటకాలు వేశారా అనడిగారు. అబ్బే లేదండీ, నిజంగా నాటకం అంటూ వెయ్యడం ఇదే మొదలు అన్నాను. అలాగా, వేషం మాత్రం బ్రహ్మాండంగా కుదిరింది, పోతన సినిమాలో శ్రీనాథుడిలా ఉన్నారు అని ప్రశంసించారు. నేనూ మా సాంబశివరావుగారితో చేరి గాల్లో ఎగురుతున్నాను.
మా ప్రదర్శనకి టైమయిందని వేదిక వెనక్కి చేరుకున్నాం. మా ముందు జరుగుతున్న ప్రోగ్రాము యెంతకీ అవదు, వేచి వేచి, చూచి చూచి, కాళ్ళు పీకుతున్నాయి అనుకొనేంతలో స్టేజిమేనేజరొచ్చి, చింతామణి వాళ్ళెవరండీ అని కేకపెట్టాడు. మేమే అన్నాం. మీరే నెక్స్టు అన్నాడు. తెలుసు అన్నాం. మీ ప్రోగ్రామెంతసేపు అన్నాడు మాకేసి అనుమానంగా చూస్తూ. సాంబశివరావుగారు ఆల్రెడీ బిల్వమంగళుడిలో పరకాయ ప్రవేశం చేసేశారు - ఇలాంటి తుఛ్ఛమైన సంభాషణలు పట్టించుకునే స్థితిలో లేరు. ఆయన చెవుల్లో అప్పటికే ప్రేక్షకులు కొట్టే వన్స్ మోర్లు గింగురు మంటున్నాయి. అందుకని నేనే బాధ్యత తీసుకుని, ఆ యెంతసేపండీ, పదిహేన్నిమిషాలు అన్నా. ఐదునిమిషాల్లో ముగించండి అని చెప్పి ఆయన హడావుడిగా వెళ్ళిపోయాడు.
వెనక్కి తిరిగి చూసేప్పటికి స్టేజిమీద తెర తీసి వుంది. స్టేజి మధ్యలో కుర్చీల్లో సాంబశివరావుగారూ, సీతా కూర్చుని ఉన్నారు. సాంబశివరావుగారు మొదటి పద్యం అందుకున్నారు. నేను పక్కన వింగ్స్ లో నుంచుని చూస్తున్నా. ఎవరో నా భుజం గోకారు. స్టేజి మేనేజరు. ఇంకా ఎంతసేపండీ అన్నాడు అసహనంగా. అప్పటికి సరిగ్గా ఒక్క నిమిషం అయింది మావాళ్ళు స్టేజెక్కి. ఇదింకా మొదటి పద్యమేనండీ. ఇంకా నాలుగు పద్యాలున్నాయి అన్నా. ఇంతలో మా పెద్దాయన పద్యం ముగించి రాగాలాపన చేస్తున్నారు. నాపక్కన స్టెజి మేనేజరు బద్దలవడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలాగున్నాడు. ఎలాగైతేనేం మొదటి పద్యం, రాగాలాపనతో సహా పూర్తయింది. సీత తన డయలాగు చెప్పబోతోంది. ఇంతలో ఆడియన్సులోంచి ఎవరో తుంటరి వన్స్ మోర్ అని అరవనే అరిచాడు. మా సాంబశివరావుగారు అలా కూచున్న కుర్చీ పాళంగా ఆరంగుళాలు గాల్లోకి లేవడం స్పష్టంగా కనబడింది. ఆయన సీత డయలాగుని మధ్యలో తుంచేసి అదే పద్యం మళ్ళీ ఎత్తుకున్నారు. స్టేజిమేనేజరుకి ఇది గోరుచుట్టుమీద రోకటిపోటులాగ తగిలింది. తెరలు లాగెయ్యండి అని ఆజ్ఞ ఇచ్చాడు. నేనేదో చెయ్యాలి గబుక్కుని. పద్యం మధ్యలో తెరపడిపోతే సాంబశివరావుగారు భరించలేరు .. నాకు తగిలించిన క్లిపాన్ మైకు ఆన్ చేసుకుని గాఠిగా నా పద్యం పాడుకుంటూ ఎంటరైపోయాను. ఆ కంగారులో అపశ్రుతిలో యెత్తుకున్నానని వేరే చెప్పక్కర్లేదు. సాంబశివరావుగారు బ్రూటస్ వెన్నుపోటు తిన్న జూలియస్సీజర్లా నిర్ఘాంతపోయి నాకేసి చూస్తున్నారు. సీత అంతకు మునుపే స్పృహతప్ఫే స్థితిలో ఉంది. అదే అదనుగా స్టేజిమేనేజరు తెరలాగేశాడు.
కథ కంచికి. మేం ఫిలడెల్ఫియాకి.
తనకళకి జరిగిన అవమానాన్నించి తేరుకోడానికి సాంబశివరావుగారికి చాలా కాలం పట్టింది. కానీ నా వేషం చూసి ఆ పెద్దాయనెవరో గౌరీనాథశాస్త్రిగారి లాగున్నావని మెచ్చినందుకు నేను మాత్రం ఇప్పటికీ మురుసుకుంటూనే వుంటా!
కబుర్లు నవంబరు 9
హమ్మయ్య. హౌస్సభ్యులు ముక్కీ మూలిగీ మొత్తానికొక ఆరోగ్య వ్యవస్థ బిల్లుని గెలిపించారు. అనుకున్నట్టుగానే రిపబ్లికన్లందరూ (ఒకరు తప్ప) దీనికి వోటెయ్యలేదు, కొంతమంది డెమోక్రాట్లుకూడా. సుమారుగా యాభయ్యేళ్ళుగా జరుగుతున్న ఈ వ్యవస్థా ఉద్ధరణ ప్రయత్నంలో చేసిన తొలి యత్నంతోనే సంపూర్ణ విజయం సాధిస్తామని అనుకోవలసిన పనిలేదు. ఎందుకంటే ఏ సూత్రాల పరిణామాలు నిజంగా ఎలా తయారవుతాయో కూచున్న చోటునుండి వీళ్ళెవరూ పసిగట్టలేరు. సరైనదిశగా ఒక అడుగైనా వెయ్యడం ముందు ముఖ్యం. ఆ అడుగు నిన్న పడింది. అందుకు సంతోషం. ఇక సెనేటుతో బేరసారాలు యెలా జరుగుతాయో చూడాలి.
ఒబామా అధ్యక్ష పదవికి యెన్నికయ్యి ఏడాదయింది గతవారంలో, తాను పదవి పగ్గాలు చేబట్టింది జనవరిలో అయినా. పైగా మొన్న మంగళారం రాష్ట్ర గవర్నర్ల పదవులకి జరిగిన రెండు ఎన్నికల్లో రిపబ్లికన్లు గెలవడంతో ఒబామా హవా తగ్గిపోయిందనీ, అతని యెజెండాని ప్రజలు వ్యతిరేకిస్తున్నారనీ ప్రచారం మొదలైపోయింది. ఒబామా అతన ప్రచారంలో చేసిన వాగ్దానాల మీద అతను ఈ యేడాదిలో సాధించి చూపించినది యిప్పటికి తక్కువే అయినా, అన్నిరకాల అభిప్రాయ సేకరణలోనూ దేశవ్యాప్తంగా ప్రజాభిప్రాయం అతనికి అనుకూలంగానే ఉంది. కానీ ఈ సహనం ఇంకా యెక్కువసేపుండకపోవచ్చు. ముఖ్యంగా దేశ ఆర్ధిక పరిస్థితి విషయంలో. కంపెనీల బేలెన్సు షీట్లు బాగుపడుతున్నాయి, వాలువీధి నావరించుకున్న గాఢాంధకారం కరిగిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి కానీ ఉద్యోగాల పరిస్థితి మాత్రం ఎక్కడా మెరుగుపడిన సూచనలు లేవు. పైపెచ్చు, దేశావ్యాప్తంగా నిరుద్యోగపు శాతం పది దాటింది (అంటే 15 మిలియన్లకి మించిన అమెరికన్లు). సామాన్యులు అల్లాడుతున్నారు, ప్రభుత్వం ఆర్ధికోద్ధరణ దిశగా చేపట్టిన పనులు అదృశ్యమవుతున్న ఉద్యోగాల్ని నిలిపి ఉంచేదుకుగానీ, కొత్త ఉద్యోగాల్ని పుట్టించేందుకు గానీ ఉపయోగపడిన దాఖలాలు లేవు. ఏతన్మధ్య ప్రభుత్వపు బిలియన్లతో ఊపిరి తిప్పుకున్న బేంకులు మంచి లాభాల్ని ప్రకటిస్తున్నాయి. త్వరలో ఉద్యోగ పరిస్థితి మారకపోతే పౌరుల సహనం ఎక్కువకాలం నిలిచి ఉండదు.
ఈ సోమవారం ఈ కార్తీకమాసానికి చివరిది అనుకుంటా. (ఇది నిజం కాదు. వొచ్చే సోమవారం కూడా కార్తీక సోమవారమే. ఈ కార్తీకమాసంలో పౌర్ణమి, అమావాస్య రెండు సోమవారాల్లోనే వచ్చాయి) ఐతే ఏంటంటా? ఏంలేదు, శివపూజకు వేళాయెరా! .. అంతే!!
తెలుగుసినీ ఆకాశంలో చిరంజీవి మెగాష్టారుగా వెలుగు పుంజుకుంటున్న రోజుల్లోనే నేను ఆంధ్రదేశానికి దూరమవ్వడంతో అనేక చిత్రరాజాల్ని మిస్సయ్యాను నేను. ఈరోజు యూట్యూబు పుణ్యమాని, పూర్తి సినిమాలు కాకపోయినా అలనాటి సినిమాలనించి పాటలైనా చూస్తుంటాను అప్పుడప్పుడూ. అలా కంటబడిందీ ఈ చక్కటి ఆణిముత్యం. మన సినిమాల్లో తల్లిప్రేమని చూపించే పాటలూ ఘట్టాలూ చాలానే ఉంటాయి. కానీ తండ్రి ప్రేమని సున్నితంగా చెప్పే దృశ్యాలు చాలా అరుదుగా వుంటై. ఈ చిన్ని పాట దృశ్యాన్ని చాలా సున్నితంగా, అందంగా, మనసు చెమర్చేలా తీశారనిపించింది.
బాలగోపాల్ గారి అకాల నిష్క్రమణ సాధారణ పౌరుల జీవితాల్లో ఎటువంటి శూన్యాన్ని మిగులుస్తున్నదో స్వానుభవంగా వివరిస్తున్నారు మిత్రులు అక్కిరాజు. పేరుపొందిన మరొక రచయిత సరికొత్తగా బ్లాగు తెరిచారు. విశాఖనించి కథా రచయిత్రి మల్లీశ్వరిగారు జాజిమల్లి అంటూ తమ కబుర్లు చెబుతున్నారు. మీరూ ఓ లుక్కెయ్యండి.
ఒబామా అధ్యక్ష పదవికి యెన్నికయ్యి ఏడాదయింది గతవారంలో, తాను పదవి పగ్గాలు చేబట్టింది జనవరిలో అయినా. పైగా మొన్న మంగళారం రాష్ట్ర గవర్నర్ల పదవులకి జరిగిన రెండు ఎన్నికల్లో రిపబ్లికన్లు గెలవడంతో ఒబామా హవా తగ్గిపోయిందనీ, అతని యెజెండాని ప్రజలు వ్యతిరేకిస్తున్నారనీ ప్రచారం మొదలైపోయింది. ఒబామా అతన ప్రచారంలో చేసిన వాగ్దానాల మీద అతను ఈ యేడాదిలో సాధించి చూపించినది యిప్పటికి తక్కువే అయినా, అన్నిరకాల అభిప్రాయ సేకరణలోనూ దేశవ్యాప్తంగా ప్రజాభిప్రాయం అతనికి అనుకూలంగానే ఉంది. కానీ ఈ సహనం ఇంకా యెక్కువసేపుండకపోవచ్చు. ముఖ్యంగా దేశ ఆర్ధిక పరిస్థితి విషయంలో. కంపెనీల బేలెన్సు షీట్లు బాగుపడుతున్నాయి, వాలువీధి నావరించుకున్న గాఢాంధకారం కరిగిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి కానీ ఉద్యోగాల పరిస్థితి మాత్రం ఎక్కడా మెరుగుపడిన సూచనలు లేవు. పైపెచ్చు, దేశావ్యాప్తంగా నిరుద్యోగపు శాతం పది దాటింది (అంటే 15 మిలియన్లకి మించిన అమెరికన్లు). సామాన్యులు అల్లాడుతున్నారు, ప్రభుత్వం ఆర్ధికోద్ధరణ దిశగా చేపట్టిన పనులు అదృశ్యమవుతున్న ఉద్యోగాల్ని నిలిపి ఉంచేదుకుగానీ, కొత్త ఉద్యోగాల్ని పుట్టించేందుకు గానీ ఉపయోగపడిన దాఖలాలు లేవు. ఏతన్మధ్య ప్రభుత్వపు బిలియన్లతో ఊపిరి తిప్పుకున్న బేంకులు మంచి లాభాల్ని ప్రకటిస్తున్నాయి. త్వరలో ఉద్యోగ పరిస్థితి మారకపోతే పౌరుల సహనం ఎక్కువకాలం నిలిచి ఉండదు.
ఈ సోమవారం ఈ కార్తీకమాసానికి చివరిది అనుకుంటా. (ఇది నిజం కాదు. వొచ్చే సోమవారం కూడా కార్తీక సోమవారమే. ఈ కార్తీకమాసంలో పౌర్ణమి, అమావాస్య రెండు సోమవారాల్లోనే వచ్చాయి) ఐతే ఏంటంటా? ఏంలేదు, శివపూజకు వేళాయెరా! .. అంతే!!
తెలుగుసినీ ఆకాశంలో చిరంజీవి మెగాష్టారుగా వెలుగు పుంజుకుంటున్న రోజుల్లోనే నేను ఆంధ్రదేశానికి దూరమవ్వడంతో అనేక చిత్రరాజాల్ని మిస్సయ్యాను నేను. ఈరోజు యూట్యూబు పుణ్యమాని, పూర్తి సినిమాలు కాకపోయినా అలనాటి సినిమాలనించి పాటలైనా చూస్తుంటాను అప్పుడప్పుడూ. అలా కంటబడిందీ ఈ చక్కటి ఆణిముత్యం. మన సినిమాల్లో తల్లిప్రేమని చూపించే పాటలూ ఘట్టాలూ చాలానే ఉంటాయి. కానీ తండ్రి ప్రేమని సున్నితంగా చెప్పే దృశ్యాలు చాలా అరుదుగా వుంటై. ఈ చిన్ని పాట దృశ్యాన్ని చాలా సున్నితంగా, అందంగా, మనసు చెమర్చేలా తీశారనిపించింది.
బాలగోపాల్ గారి అకాల నిష్క్రమణ సాధారణ పౌరుల జీవితాల్లో ఎటువంటి శూన్యాన్ని మిగులుస్తున్నదో స్వానుభవంగా వివరిస్తున్నారు మిత్రులు అక్కిరాజు. పేరుపొందిన మరొక రచయిత సరికొత్తగా బ్లాగు తెరిచారు. విశాఖనించి కథా రచయిత్రి మల్లీశ్వరిగారు జాజిమల్లి అంటూ తమ కబుర్లు చెబుతున్నారు. మీరూ ఓ లుక్కెయ్యండి.
కబుర్లు - నవంబరు 2
మిత్రులందరికీ మరోసారి మనస్పూర్తిగా ధన్యవాదాలు.
కాలం గడిచిపోతోందోయ్ అని గుర్తించుకునేందుకూ, హెచ్చరించేందుకూ ఎన్నెన్ని సూచికలో! న్యూయియర్లు, పుట్టిన్రోజులు, వార్షికోత్సవాలు .. అమెరికాలో అయితే, వసంతంలో గడియారాన్ని ముందుకు తొయ్యడం, శిశిరంలో వెనక్కి లాగడం .. ఇదో తతంగం. ఈ సంవత్సరం మొన్నమొన్ననే మొదలయినట్లుంది, ఇంకా చెక్కుల మీద 2009 అని రాయడం పూర్తిగా అలవాటయినట్టే లేదు, అంతలోనే సంవత్సరం అయ్యేపోవస్తోంది. కాలేజిలో నా సహాధ్యాయి మిత్రుడొకడు మొన్న కాల్చేసి చెప్పాడు, మా బేచి స్నాతకులయ్యి వచ్చేయేడు రజతోత్సవంట. కాలం అలా పరిగెత్తుతూనే వుంటుంది. మన చేతిలో వున్నది ఈ క్షణమే దాని విలువ నెరిగి సద్వినియోగ పరుచుకోవడమే మనం చెయ్యగలిగిందల్లా. అందుకనే దీన్ని ఆంగ్లంలో ప్రెజెంట్ అన్నారు .. అది బహుమతే .. నిజంగా!!
అసలు బయటి ప్రపంచంలో ఏం జరుగుతోందో పట్టించుకునే తీరికలేనంత పని వత్తిడి. ఎప్పుడన్నా రెణ్ణిమిషాలు తీరిక దొరికితే నా అభిమాన బ్లాగుల్లో ఓ లుక్కేసి చదివింది నచ్చితే ఓ రెండు వాక్యాలు గిలకడం. యాహూన్యూసులో కూడా వార్తలు చదివేందుకు కుదరట్లేదు అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో గమనించగలరు. ఏతన్మధ్య, గత వారాంతంలో రెండు అద్భుతమైన కార్యక్రమాలు జరిగినై. ముందుగా శనివారం ఇక్కడ స్థానిక డిట్రాయిట్ తెలుగు సమితివారి దీపావళి వేడుకల్లో
నరకాసురవధ నాటిక ప్రదర్శించాము. ఈ కార్యక్రమం మా వూళ్ళో పేరెన్నిక గన్న నాట్యాచార్యులు శ్రీమతి సాంధ్యశ్రీ ఆత్మకూరిగారి పర్యవేక్షణలో జరిగింది. అందులో నేను నరకాసురుడి పాత్ర ధరించాను. సంధ్యగారి వంటి మంచి సృజనాత్మక దృష్టికలిగిన సమర్ధులతో పని చెయ్యడం ఒక అదృష్టమైతే, కొన్ని పదులగంటలు టీనేజర్లైన పిల్లల సాంగత్యంలో గడుపుతూ వారి ఉత్సాహాన్ని ఆస్మాసిస్ ద్వారా వంటపట్టించుకోవడం కూడా చాలా సరదా అయిన అనుభవం. పిల్లలందరూ చాలా బాగా చేశారు .. ముఖ్యంగా సత్యభామగా చిరంజీవి అర్చిత అద్భుతంగా నటించింది. అన్నట్టు మన కాలాస్త్రి శ్రీ కూడా సూత్రధారునిగా తనవంతు పాత్ర సమర్ధవంతంగా పోషించారు.
ఇదయినాక, మరునాడు, ఆదివారంనాడు, మా వూరి నిలయవిద్వాంసులతో ఒక కర్నాటక సంగీత కచేరీ నిర్వహించాము కొందరు మిత్రులం కలిసి. కొంతకాలంగా మా వూళ్ళో అస్సలు కచేరీలనేవి జరక్కపోవడం ఒకటీ, అదికాక, వూళ్ళో ఎంతో ప్రతిభావంతులైన కళాకారులు ఉండి కూడా, వారి ప్రతిభకి సరైన వేదిక దొరక్కపోవడం ఒకటీ గమనించి, కొందరు మిత్రులం కలిసి ఈ కచేరీ ఏర్పాటు చేశాం. రెండు భాగాల కచేరీ. ముందుగా శశిధర్ గారి వీణావాదనం, మృదంగం మీద జయసింగం, ఒక గంటన్నరసేపు. భైరవి అటతాళ వర్ణంతో మొదలెట్టి , రాగాల ఎంపికలో చక్కటి వైవిధ్యం కనబరుస్తూ, పూర్వికళ్యాణిలో మీనాక్షిని సాక్షాత్కరించి, శంకరాభరణంలో ఎదుట నిలచితే నీ సొమ్మేమి పోవునని రాముణ్ణి నిలదీసి, ధనశ్రీ తిల్లానాతో ముగించారు. తదుపరి మల్లాజోస్యుల దంపతులు (శ్రీకాంత్, పావని) వయొలిన్ ద్వయం, రాజశేఖర్ ఆత్మకూరిగారి మృదంగవాద్య సహకారంతో. శ్రీరాగవర్ణంతో మొదలై లాల్గూడివారి కానడ తిల్లానాతో ముగిసిన వీరికచేరీలో శ్రీరంజని రాగం తానం పల్లవి తలమానికంగా నిలిచింది. వందమందికి పైగా శ్రోతలు హాజరవడం నాకు చాలా ఆనందం కలిగించింది.
వారాంతపు రెండ్రోజులూ ఇంత చక్కటి అనుభూతుల్ని మూటగట్టుకున్నాక, సోమవారంనాడు పనిలో తగిలిన ఎడాపెడా వాయింపులతో బుర్ర వాచిపోయి సాయంత్రానికల్లా ఒక విధమైన నిర్వేదం వచ్చేసింది .. ఆనందం కానీ తృప్తికానీ ఇంత క్షణికమా, ఇంత అశాశ్వతమా అని చాలా ఆశ్చర్యపోయాను. అఫ్కోర్సు, అది విధి నిర్వహణ కాబట్టి, ఎన్ని వాయింపులు తగిల్నా తట్టుకుని నిలబడ్డం, అదొక అనుభవంకింద జమ వేసుకుని ముందుకి సాగిపోవడం తప్ప వేరే గత్యంతరం లేదు కాబట్టి మళ్ళీ మర్నాటికల్లా నిలదొక్కుకున్నా ననుకోండి. అసలు, మాట వరసకి చెబుతున్నా, జీవితంలో ఈ వొడిదుడుకులు ఇలా ఎలా పక్కపక్కనే వస్తాయో అని.
ఆకులు రాలే పోయాయి వారాంతంలో వచ్చిన గాలివానకి. కానీ అక్టోబరు నెలంతా గొప్ప రంగుల్తో అలరించింది ప్రకృతి. ఎటుచూసినా రంగులు, రంగులు .. గుట్టలు గుట్టలుగా రాశులు రాశులుగా రంగులు. రెండేళ్ళ క్రితం ఈ ఆకురాలు కాలపు అనుభవాన్ని రాసుకున్న వైనం ఇక్కడ.
కాలం గడిచిపోతోందోయ్ అని గుర్తించుకునేందుకూ, హెచ్చరించేందుకూ ఎన్నెన్ని సూచికలో! న్యూయియర్లు, పుట్టిన్రోజులు, వార్షికోత్సవాలు .. అమెరికాలో అయితే, వసంతంలో గడియారాన్ని ముందుకు తొయ్యడం, శిశిరంలో వెనక్కి లాగడం .. ఇదో తతంగం. ఈ సంవత్సరం మొన్నమొన్ననే మొదలయినట్లుంది, ఇంకా చెక్కుల మీద 2009 అని రాయడం పూర్తిగా అలవాటయినట్టే లేదు, అంతలోనే సంవత్సరం అయ్యేపోవస్తోంది. కాలేజిలో నా సహాధ్యాయి మిత్రుడొకడు మొన్న కాల్చేసి చెప్పాడు, మా బేచి స్నాతకులయ్యి వచ్చేయేడు రజతోత్సవంట. కాలం అలా పరిగెత్తుతూనే వుంటుంది. మన చేతిలో వున్నది ఈ క్షణమే దాని విలువ నెరిగి సద్వినియోగ పరుచుకోవడమే మనం చెయ్యగలిగిందల్లా. అందుకనే దీన్ని ఆంగ్లంలో ప్రెజెంట్ అన్నారు .. అది బహుమతే .. నిజంగా!!
అసలు బయటి ప్రపంచంలో ఏం జరుగుతోందో పట్టించుకునే తీరికలేనంత పని వత్తిడి. ఎప్పుడన్నా రెణ్ణిమిషాలు తీరిక దొరికితే నా అభిమాన బ్లాగుల్లో ఓ లుక్కేసి చదివింది నచ్చితే ఓ రెండు వాక్యాలు గిలకడం. యాహూన్యూసులో కూడా వార్తలు చదివేందుకు కుదరట్లేదు అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో గమనించగలరు. ఏతన్మధ్య, గత వారాంతంలో రెండు అద్భుతమైన కార్యక్రమాలు జరిగినై. ముందుగా శనివారం ఇక్కడ స్థానిక డిట్రాయిట్ తెలుగు సమితివారి దీపావళి వేడుకల్లో
నరకాసురవధ నాటిక ప్రదర్శించాము. ఈ కార్యక్రమం మా వూళ్ళో పేరెన్నిక గన్న నాట్యాచార్యులు శ్రీమతి సాంధ్యశ్రీ ఆత్మకూరిగారి పర్యవేక్షణలో జరిగింది. అందులో నేను నరకాసురుడి పాత్ర ధరించాను. సంధ్యగారి వంటి మంచి సృజనాత్మక దృష్టికలిగిన సమర్ధులతో పని చెయ్యడం ఒక అదృష్టమైతే, కొన్ని పదులగంటలు టీనేజర్లైన పిల్లల సాంగత్యంలో గడుపుతూ వారి ఉత్సాహాన్ని ఆస్మాసిస్ ద్వారా వంటపట్టించుకోవడం కూడా చాలా సరదా అయిన అనుభవం. పిల్లలందరూ చాలా బాగా చేశారు .. ముఖ్యంగా సత్యభామగా చిరంజీవి అర్చిత అద్భుతంగా నటించింది. అన్నట్టు మన కాలాస్త్రి శ్రీ కూడా సూత్రధారునిగా తనవంతు పాత్ర సమర్ధవంతంగా పోషించారు.ఇదయినాక, మరునాడు, ఆదివారంనాడు, మా వూరి నిలయవిద్వాంసులతో ఒక కర్నాటక సంగీత కచేరీ నిర్వహించాము కొందరు మిత్రులం కలిసి. కొంతకాలంగా మా వూళ్ళో అస్సలు కచేరీలనేవి జరక్కపోవడం ఒకటీ, అదికాక, వూళ్ళో ఎంతో ప్రతిభావంతులైన కళాకారులు ఉండి కూడా, వారి ప్రతిభకి సరైన వేదిక దొరక్కపోవడం ఒకటీ గమనించి, కొందరు మిత్రులం కలిసి ఈ కచేరీ ఏర్పాటు చేశాం. రెండు భాగాల కచేరీ. ముందుగా శశిధర్ గారి వీణావాదనం, మృదంగం మీద జయసింగం, ఒక గంటన్నరసేపు. భైరవి అటతాళ వర్ణంతో మొదలెట్టి , రాగాల ఎంపికలో చక్కటి వైవిధ్యం కనబరుస్తూ, పూర్వికళ్యాణిలో మీనాక్షిని సాక్షాత్కరించి, శంకరాభరణంలో ఎదుట నిలచితే నీ సొమ్మేమి పోవునని రాముణ్ణి నిలదీసి, ధనశ్రీ తిల్లానాతో ముగించారు. తదుపరి మల్లాజోస్యుల దంపతులు (శ్రీకాంత్, పావని) వయొలిన్ ద్వయం, రాజశేఖర్ ఆత్మకూరిగారి మృదంగవాద్య సహకారంతో. శ్రీరాగవర్ణంతో మొదలై లాల్గూడివారి కానడ తిల్లానాతో ముగిసిన వీరికచేరీలో శ్రీరంజని రాగం తానం పల్లవి తలమానికంగా నిలిచింది. వందమందికి పైగా శ్రోతలు హాజరవడం నాకు చాలా ఆనందం కలిగించింది.
వారాంతపు రెండ్రోజులూ ఇంత చక్కటి అనుభూతుల్ని మూటగట్టుకున్నాక, సోమవారంనాడు పనిలో తగిలిన ఎడాపెడా వాయింపులతో బుర్ర వాచిపోయి సాయంత్రానికల్లా ఒక విధమైన నిర్వేదం వచ్చేసింది .. ఆనందం కానీ తృప్తికానీ ఇంత క్షణికమా, ఇంత అశాశ్వతమా అని చాలా ఆశ్చర్యపోయాను. అఫ్కోర్సు, అది విధి నిర్వహణ కాబట్టి, ఎన్ని వాయింపులు తగిల్నా తట్టుకుని నిలబడ్డం, అదొక అనుభవంకింద జమ వేసుకుని ముందుకి సాగిపోవడం తప్ప వేరే గత్యంతరం లేదు కాబట్టి మళ్ళీ మర్నాటికల్లా నిలదొక్కుకున్నా ననుకోండి. అసలు, మాట వరసకి చెబుతున్నా, జీవితంలో ఈ వొడిదుడుకులు ఇలా ఎలా పక్కపక్కనే వస్తాయో అని.
ఆకులు రాలే పోయాయి వారాంతంలో వచ్చిన గాలివానకి. కానీ అక్టోబరు నెలంతా గొప్ప రంగుల్తో అలరించింది ప్రకృతి. ఎటుచూసినా రంగులు, రంగులు .. గుట్టలు గుట్టలుగా రాశులు రాశులుగా రంగులు. రెండేళ్ళ క్రితం ఈ ఆకురాలు కాలపు అనుభవాన్ని రాసుకున్న వైనం ఇక్కడ.
అమెరికా అంటే నాకిష్టం - స్వశక్తి
నేను చూసినంతలో, ఈ దేశంలో నా వృత్తి సంబంధమైన జీవితంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ నాకు పరిచయమైన అమెరికన్లందరూ బాగా కష్టపడి పనిచేసే స్వభావం కలిగినవారు, స్వశక్తి మీద ఆధారపడి పైకి రావాలనే తపన కలిగినవారు.
ఈ నిర్ధారణలో వేరే దాగిఉన్న ఉద్దేశ్యాలేమీ లేవు. అమెరికన్లు కానివారు కష్టపడి పనిచెయ్యరని కాదు. దేశప్రజలందరూ కష్టపడి పనిచేసేస్తారనీ కాదు. ఇలాంటి నిర్ధారణని సర్వత్రా అన్వయించడం సాధ్యమయ్యే పని కాదు. నిర్ధారణకి వ్యతిరేకమైన ఉదాహరణలు కోకొల్లలుగా ఉంటాయి, సందేహం లేదు. నా అనుభవం పరిధి చాలా చిన్నది అని ఒప్పుకుంటూనే నాకెదురైనవీ, పబ్లిగ్గా వార్తల్లో తెలియ వచ్చినవీ కొన్ని ఉదాహరణలిస్తాను.
ముందుగా పబ్లిక్ వార్తల నించి.
హాలీవుడ్ నటుడు నికొలాస్ కేజ్ (Nicholas Cage) 1996 లో లీవింగ్ లాస్ వేగస్ అనే సినిమాకి ఆస్కార్ గెల్చుకున్నాడు, తదుపరి అనేక బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి తారగా ఎదిగాడని చాలామందికి తెలిసిన విషయం. గొప్పదర్శకునిగా పేరుపొందిన ఫ్రేన్సిస్ ఫోర్డ్ కోపొలా (Francis Ford Coppola) సోదరుని కొడుకు అనే సత్యం చాలామందికి తెలియదు. కోపొలా కుటుంబ సభ్యులు చాలామంది అప్పటికే సినీరంగంలో పేరుమోసినవారున్నారు. కుటుంబం పేరువల్లనో, లేక చుట్టాల ప్రాపకంవల్లనో కాక తన స్వశక్తితోనే పైకి రావాలని పద్ధెనిమిదేళ్ళ వయసులోనే తన ఇంటిపేరు మార్చుకుని సినీరంగంలో ప్రవేశించాడు. ఎన్నో లోబడ్జెట్ చిత్రాల్లో చిన్నా చితకా పాత్రలు వేశాడు. ఇతను పెద్దతార కాకమునుపు నటించిన చిత్రాల్లో Guarding Tess (1994), Amos & Andrew (1993) మెచ్చదగినవి. ఇటీవల ఒక్క సినిమాకి ఇరవై మిలియన్ డాలర్లు పారితోషికం అందుకున్న నికొలాస్ తనకి ఆస్కార్ తెచ్చిపెట్టిన Leaving Las Vegas కి తీసుకున్న పారితోషికం అందులో వందోవంతు కూడా ఉండదు.
అమెరికాలో అత్యంత ధనవంతుల్లో ఒకరైన వారెన్ బఫెట్ (Warren Buffett) గారి కొడుకులు హోవర్డ్ మరియు పీటర్ బఫెట్. హోవర్డ్ తనంత తానుగా వాణిజ్య రంగంలో ఎదిగి, అనేక బాధ్యతాయుతమైన పదవులు నిర్వహించి ప్రస్తుతం వారి సొంత పొలాన్ని నిర్వహిస్తున్నారు. రెండో కొడుకు పీటర్ మొదటినించీ తనకిష్టమైన వ్యాపకమైన సంగీతంలో కృషిచేసి అనేక విజయాలు సాధించారు. Dances with the wolves అనే చిత్రానికి నేపథ్యసంగీతం అందించి ఆస్కార్ గెల్చుకున్నారు.
గొప్ప రాజకీయ నాయకుల సంతతి కూడా చాలామంది తమతమ రంగాల్లో స్వశక్తితోనే విజయాలు సాధించిన దృష్టాంతాలు చాలా ఉన్నాయి.
నా వ్యక్తిగత పరిచయాల్లో ఇటీవల తారసపడిన ఒక యువకుడి కథనం నన్ను చాలా అబ్బురపరిచింది. ఈ మధ్య కొత్తకారు కొనాలని కారుడీలర్లచుట్టూ తిరుగుతున్నా. ఒక డీలరు దగ్గర జేసన్ అనే సేల్స్మేన్ ఆ రోజు నాకు కార్లు చూపిస్తున్నాడు. సుమారు ఇరవయ్యెనిమిదేళ్ళుంటాయి. ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ, నా వృత్తిరీత్యా కార్లకంపెనీలతో నాకున్న అనుబంధాన్ని గురించి చెబుతున్నా అతనితో. మా నాన్న కూడా జెనెరల్ మోటార్స్కి పని చేసేవారు - కొన్నేళ్ళ కిందట రిటైరయ్యారు అన్నాడు జేసన్. అలాగా, ఏ ప్లాంట్లో పనిచేసేవారు అన్నా. అబ్బే ప్లాంట్లో కాదు అన్నాడు. ఓహో, ఏదో ఇంజనీరో మేనేజరో అయుంటారు అని, ఏ డిపార్టుమెంట్లో అనడిగా. అతను చిన్నగా నవ్వి, ఏ డిపార్టుమెంటని చెప్పను? ఆయన కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్గా రిటైరయ్యారు అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇదే సన్నివేశాన్ని భారద్దేశంలో ప్రతిబింబిస్తే, ఒక టాటా కంపెనీకో, రిలయన్స్కో వైస్ ప్రెసిడెంట్గా పనిచేసినాయన కొడుకుని ఒక కార్ డీలర్షిప్లో సేల్స్మేన్గా ఊహించగలమా?
ఈ విషయాలన్నీ నా అమెరికన్ సహోద్యోగితో చర్చిస్తుంటే అతనొక మాటన్నాడు. అమెరికాలో ఎస్టేట్ శిస్తులు (అంటే వంశపారంపర్యమైన ఆస్తి తరువాతి తరాలకి బదలీ అయేప్పుడు కట్టాల్సిన శిస్తు) చాలా ఎక్కువ వుంటాయి-ట. అందువల్ల, తండ్రి తాతలు ఎంతెంత ఆస్తులు సంపాయించినా, తరువాతి తరాల చేతులో మిగిలేది చాలా తక్కువే. అదీకాక, చాలా మంది గొప్ప ధనవంతులు తాము సంపాయించిన ఆస్తిలో సింహభాగాన్ని ఏదన్నా ఫౌండేషనుగానో ట్రస్టుగానో ఏర్పరిచి ప్రజోపయోగ కార్య్క్రమలకి ఉపయోగించడానికి ఇష్టపడుతుంటారు. ఇవన్నీ కాక, అమెరికను మనస్తత్వంలో అల్లుకుపోయి ఉన్న స్వేఛ్ఛాప్రియత్వం కూడా ఒక కారణం కావచ్చు.
ఏదేమైనా, ఇలా స్వశక్తితో కష్టపడి పైకిరావడమనే ఆదర్శం వల్ల, అమెరికను సమాజంలో కొత్తతరాలు ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా, సృజనాత్మకంగా ముందడుగు వేస్తూ వస్తున్నాయని నాకనిపించింది.
ఈ నిర్ధారణలో వేరే దాగిఉన్న ఉద్దేశ్యాలేమీ లేవు. అమెరికన్లు కానివారు కష్టపడి పనిచెయ్యరని కాదు. దేశప్రజలందరూ కష్టపడి పనిచేసేస్తారనీ కాదు. ఇలాంటి నిర్ధారణని సర్వత్రా అన్వయించడం సాధ్యమయ్యే పని కాదు. నిర్ధారణకి వ్యతిరేకమైన ఉదాహరణలు కోకొల్లలుగా ఉంటాయి, సందేహం లేదు. నా అనుభవం పరిధి చాలా చిన్నది అని ఒప్పుకుంటూనే నాకెదురైనవీ, పబ్లిగ్గా వార్తల్లో తెలియ వచ్చినవీ కొన్ని ఉదాహరణలిస్తాను.
ముందుగా పబ్లిక్ వార్తల నించి.
హాలీవుడ్ నటుడు నికొలాస్ కేజ్ (Nicholas Cage) 1996 లో లీవింగ్ లాస్ వేగస్ అనే సినిమాకి ఆస్కార్ గెల్చుకున్నాడు, తదుపరి అనేక బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి తారగా ఎదిగాడని చాలామందికి తెలిసిన విషయం. గొప్పదర్శకునిగా పేరుపొందిన ఫ్రేన్సిస్ ఫోర్డ్ కోపొలా (Francis Ford Coppola) సోదరుని కొడుకు అనే సత్యం చాలామందికి తెలియదు. కోపొలా కుటుంబ సభ్యులు చాలామంది అప్పటికే సినీరంగంలో పేరుమోసినవారున్నారు. కుటుంబం పేరువల్లనో, లేక చుట్టాల ప్రాపకంవల్లనో కాక తన స్వశక్తితోనే పైకి రావాలని పద్ధెనిమిదేళ్ళ వయసులోనే తన ఇంటిపేరు మార్చుకుని సినీరంగంలో ప్రవేశించాడు. ఎన్నో లోబడ్జెట్ చిత్రాల్లో చిన్నా చితకా పాత్రలు వేశాడు. ఇతను పెద్దతార కాకమునుపు నటించిన చిత్రాల్లో Guarding Tess (1994), Amos & Andrew (1993) మెచ్చదగినవి. ఇటీవల ఒక్క సినిమాకి ఇరవై మిలియన్ డాలర్లు పారితోషికం అందుకున్న నికొలాస్ తనకి ఆస్కార్ తెచ్చిపెట్టిన Leaving Las Vegas కి తీసుకున్న పారితోషికం అందులో వందోవంతు కూడా ఉండదు.
అమెరికాలో అత్యంత ధనవంతుల్లో ఒకరైన వారెన్ బఫెట్ (Warren Buffett) గారి కొడుకులు హోవర్డ్ మరియు పీటర్ బఫెట్. హోవర్డ్ తనంత తానుగా వాణిజ్య రంగంలో ఎదిగి, అనేక బాధ్యతాయుతమైన పదవులు నిర్వహించి ప్రస్తుతం వారి సొంత పొలాన్ని నిర్వహిస్తున్నారు. రెండో కొడుకు పీటర్ మొదటినించీ తనకిష్టమైన వ్యాపకమైన సంగీతంలో కృషిచేసి అనేక విజయాలు సాధించారు. Dances with the wolves అనే చిత్రానికి నేపథ్యసంగీతం అందించి ఆస్కార్ గెల్చుకున్నారు.
గొప్ప రాజకీయ నాయకుల సంతతి కూడా చాలామంది తమతమ రంగాల్లో స్వశక్తితోనే విజయాలు సాధించిన దృష్టాంతాలు చాలా ఉన్నాయి.
నా వ్యక్తిగత పరిచయాల్లో ఇటీవల తారసపడిన ఒక యువకుడి కథనం నన్ను చాలా అబ్బురపరిచింది. ఈ మధ్య కొత్తకారు కొనాలని కారుడీలర్లచుట్టూ తిరుగుతున్నా. ఒక డీలరు దగ్గర జేసన్ అనే సేల్స్మేన్ ఆ రోజు నాకు కార్లు చూపిస్తున్నాడు. సుమారు ఇరవయ్యెనిమిదేళ్ళుంటాయి. ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ, నా వృత్తిరీత్యా కార్లకంపెనీలతో నాకున్న అనుబంధాన్ని గురించి చెబుతున్నా అతనితో. మా నాన్న కూడా జెనెరల్ మోటార్స్కి పని చేసేవారు - కొన్నేళ్ళ కిందట రిటైరయ్యారు అన్నాడు జేసన్. అలాగా, ఏ ప్లాంట్లో పనిచేసేవారు అన్నా. అబ్బే ప్లాంట్లో కాదు అన్నాడు. ఓహో, ఏదో ఇంజనీరో మేనేజరో అయుంటారు అని, ఏ డిపార్టుమెంట్లో అనడిగా. అతను చిన్నగా నవ్వి, ఏ డిపార్టుమెంటని చెప్పను? ఆయన కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్గా రిటైరయ్యారు అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇదే సన్నివేశాన్ని భారద్దేశంలో ప్రతిబింబిస్తే, ఒక టాటా కంపెనీకో, రిలయన్స్కో వైస్ ప్రెసిడెంట్గా పనిచేసినాయన కొడుకుని ఒక కార్ డీలర్షిప్లో సేల్స్మేన్గా ఊహించగలమా?
ఈ విషయాలన్నీ నా అమెరికన్ సహోద్యోగితో చర్చిస్తుంటే అతనొక మాటన్నాడు. అమెరికాలో ఎస్టేట్ శిస్తులు (అంటే వంశపారంపర్యమైన ఆస్తి తరువాతి తరాలకి బదలీ అయేప్పుడు కట్టాల్సిన శిస్తు) చాలా ఎక్కువ వుంటాయి-ట. అందువల్ల, తండ్రి తాతలు ఎంతెంత ఆస్తులు సంపాయించినా, తరువాతి తరాల చేతులో మిగిలేది చాలా తక్కువే. అదీకాక, చాలా మంది గొప్ప ధనవంతులు తాము సంపాయించిన ఆస్తిలో సింహభాగాన్ని ఏదన్నా ఫౌండేషనుగానో ట్రస్టుగానో ఏర్పరిచి ప్రజోపయోగ కార్య్క్రమలకి ఉపయోగించడానికి ఇష్టపడుతుంటారు. ఇవన్నీ కాక, అమెరికను మనస్తత్వంలో అల్లుకుపోయి ఉన్న స్వేఛ్ఛాప్రియత్వం కూడా ఒక కారణం కావచ్చు.
ఏదేమైనా, ఇలా స్వశక్తితో కష్టపడి పైకిరావడమనే ఆదర్శం వల్ల, అమెరికను సమాజంలో కొత్తతరాలు ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా, సృజనాత్మకంగా ముందడుగు వేస్తూ వస్తున్నాయని నాకనిపించింది.
Invitation to Carnatic Music concert in metro-Detroit
We invite you to enjoy an afternoon of Carnatic Instrumental Music.
We are very happy to present very talented local musicians in concert.
Veena solo by
Accompanied on mrudangam by
Followed by
Violin duet by
Accompanied on mrudangam by
Venue: Troy Community Center Room 304
3179 Livernois Rd
Troy, MI 48083-5029
(248) 524-3484
Date and Time: October 25, 2009 (Sunday); 3 - 6 PM
We are very happy to present very talented local musicians in concert.
Veena solo by
Sri Sasidhar Lakshminarayana
Accompanied on mrudangam by
Sri Jeyasingham
Followed by
Violin duet by
Smt. Pavani and Sri Srikanth Mallajosyula
Accompanied on mrudangam by
Sri Rajasekhar Athmakuri
Venue: Troy Community Center Room 304
3179 Livernois Rd
Troy, MI 48083-5029
(248) 524-3484
Date and Time: October 25, 2009 (Sunday); 3 - 6 PM
కబుర్లు - అక్టోబరు 12
డా. కె. బాలగోపాల్ గారి అకాల ఆకస్మిక మరణం దిగ్భ్రాంతి కలిగించింది. వారితో నేరుగా పరిచయం లేకపోయినా, ఆయన సన్నిహితులు చాలా మందితో అనేక ప్రాజెక్టుల్లో పనిచెయ్యడం వల్ల ఆయన వ్యక్తిత్వం నాకు పరిచయమైనట్టే ఉంది. అదీ కాక, ఆయన రచనలు అనేక పత్రికల్లో చదువుతుండడం, ఒక విషయాన్ని నిశితంగా విశ్లేషీంచే ఆయన బుద్ధి పటిమ, తాను కనుగొన్న విషయాన్ని, ఎంత క్లిష్టమైనదైనా, విప్పి చెప్పగలిగే చక్కటి వాగ్ధార ఆయన రచనా లక్షణాలు. యాదృఛ్ఛికంగా మొన్న వయ్యెస్సార్ మృతి తరవాత, ఆయన చరిత్ర గురించి వెతుకుతుంటే, 2004 ఎన్నికల తరవాత వయ్యెస్సార్ రాజకీయ జీవితాన్నీ సీమ రాజకీయ నేపథ్యాన్నీ సమీక్షిస్తూ బాలగోపాల్ గారు రాసిన ఈ వ్యాసం నా కంట పడింది. బాలగోపాల్ వంటి వ్యక్తులు కనుమరుగైనప్పుడు, విధిని నిందించడం, కుటుంబానికి సానుభూతి తెలుపుకోడం, ఆత్మ శాంతికి ప్రార్ధించడం ఇవన్నీ అర్ధంలేని పన్లుగా కనిపిస్తాయి నాకు. మనం చెయ్యాల్సిందల్లా .. ఆ కనుమరుగైన మనిషి ఎటువంటి విలువల్ని నమ్మి ఆచరించారో ఆ విలువల్ని అప్పుడప్పుడూ అయినా గుర్తు చేసుకుంటూ, చాతనైతే మనం కూడా ఆ విలువల్ని మన జీవితాల్లో ఆచరిస్తూ ముందడుగు వెయ్యడమే.
కాబూల్లో భారతీయ దౌత్య కార్యాలయం వద్ద బాంబు పేలింది. ఇంకా తాజాగా రావల్పిండిలో ఏకంగా పాకిస్తాను సైన్య ముఖ్య కార్యాలయం మీదనే భీకరమైన దాడి చేశారు తాలిబాన్ దుండగులు. మన కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా నాకైతే ఎక్కడా కనబళ్ళేదు. పక్క వీధిలో ఇళ్ళు నిప్పంటుకున్నాయని తెలిసినప్పుడైనా మన చూరు మీదా నీళ్ళు చల్లుకోకుండా కూర్చుంటే ... ఇదిలా ఉండగా 40,000 సైన్యం అదనంగా కావాలని అడిగారుట ఆఫ్ఘనిస్తానులో నేటో సైన్యాధ్యక్షుడు. సాధారణ ప్రజలు ఎలా ఉంటున్నారో, ఏమి అల్లాడి పోతున్నారో .. ఇంతలో చలికాలం రానున్నది. ఎనిమిదేళ్ళయింది అమెరికా తొలి దాడులు జరిపి ..
తుంగభద్ర, కృష్ణ వరదల నేపథ్యంలో, జీమెయిలు చాట్లో ఎవరన్నా ఇండియా స్నేహితులు కనబడి చాట్లో చెబితే తెలిసిన వివరాలు తప్ప, ఆన్లైన్ పత్రికల్లో కానీ, పదే పదే ఎప్పటికప్పుడు యూట్యూబులో అప్లోడ్ అవుతూ ఉండిన టీవీ వార్తా ఛానెళ్ళ ప్రసారాలు కానీ ఒక్క పనికొచ్చే వార్త చెప్పలేదు. ఈ సందర్భంగా బ్లాగుల్లో టీవీ ఛానెళ్ళ తాండవాన్ని మన వాళ్ళు బాగానే విమర్శించారు. అదలా ఉండగా, వార్తా పత్రిక గానీ, వార్తా ఛానెల్ గానీ, ఒక పద్ధతి ప్రకారం కవరేజ్ ఇవ్వనక్కర్లేదా? ఉదాహరణకి, ఈనాడో, ఆంధ్ర జ్యోతో తెరిస్తే, కనీసం ఒక అరగంట వెతుక్కోవాలి, కృష్ణ వెంబడి పలాని వూర్లో పరిస్థితి ఎలాగుందో అని తెలుసుకోవడానికి. కృష్ణ ప్రవహించే మార్గం తెలిసినదే. దాన్ని ఒక మేప్ గా ఇచ్చి, దాన్నించి వివిధ ప్రాంతాల వివరాల్ని ఇవ్వచ్చు. ఇంకా చాలా రకాలుగా సమర్ధవంతంగా ఇవ్వచ్చు. ఈ సందర్భంగా వార్తా మాధ్యమాల పూర్తి ఫెయిలయ్యాయని భావిస్తున్నాన్నేను. సరే, వరద తగ్గు మొగం పట్టిందని చదివి, హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని పోనీ మన మేధావులేమని విశ్లేషిస్తున్నారో అని ఆంధ్రజ్యోతి సంపాదకీయం తీస్తే, ప్రధాన సంపాదకుడు కే. శ్రీనివాస్ గారు, ఏంటో తలా తోకా లేకుండా .. ఋగ్వేదం నించి కొటేషన్లు చెబుతూ .. ఆయన తెలివినంతా కుమ్మరించింది చదివేప్పటికి నాకు తిక్క నసాళం అంటుకుంది.
ఉట్టుడియంగా ఒబామాకి నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారు. ఈ నార్వీజియన్లకి చదవేస్తే ఉన్నమతి పోతున్నట్టుంది :) నేను ఒబామా అభిమానినే గానీ, ఇది మాత్రం టుమ్మచ్ అనిపించింది. ఆయన సున్నితంగా తిరస్కరించే బావుణ్ణని కూడా అనుకున్నాను. కానీ హబ్బే మారీ బాగుండదేమో అని సిగ్గు పడుతూనే స్వీకరించేశాడు. బుష్షుగారు మిగతాప్రపంచం మీదంతా కత్తులు దూస్తూ వీరతాండవం చెయ్యనారంభించిన రోజునుంచీ, ఈ నార్వీజియన్లకి ఎట్లాగైనా అమెరికన్ల దిమ్మతిరిగేలా ఒక్క చెంపపెట్టు పెట్టాలని వాళ్ళకి చేతులు తిమ్మిరి తిమ్మిర్గా ఉన్నాయనీ, ఒబామాకి శాంతి నోబెలు నిచ్చేసి ఆ తిమ్మిరి తీర్చేసుకున్నారనీ నాకో గాట్ఠి అనుమానం. అసలే మనిషి అందర్నీ కలుపుకు పోవాలీ, ఎక్కడా మాట తొణక్కూడదూ అన్నట్టు ఆచి తూచి అడుగేస్తుంటాడు .. ఇహ ఇంత గౌరవం చేసేశాక, ఇంక మరీ జాగ్రత్త పరుడైపోతాడేమో అని నా భయం. ఎందుకంటే, రాజకీయం, జాతీయంగానైనా, అంతర్జాతీయంగానైనా ఏదన్నా ముఖ్యమైన విజయం సాధించాలంటే కొంచెం తెగింపు ఉండాలి. ఇతగాడు సాధించాల్సిన ఘనకార్యాలెన్నో ఉన్నాయి. ఈ బహుమతి ఏదో ఆయనకి గర్వంతో కళ్ళు నెత్తిమీదికి తెస్తుందనే భయం లేదు కాని, ఈయన జాగ్రత్త విపరీతం ఐపోతుందని మాత్రం నాకు భయంగా ఉంది. టైం పత్రిక విలేకరి జో లైన్ తనబ్లాగులో నా భావాల్ని సరిగ్గా పట్టుకున్నాడు.
కాబూల్లో భారతీయ దౌత్య కార్యాలయం వద్ద బాంబు పేలింది. ఇంకా తాజాగా రావల్పిండిలో ఏకంగా పాకిస్తాను సైన్య ముఖ్య కార్యాలయం మీదనే భీకరమైన దాడి చేశారు తాలిబాన్ దుండగులు. మన కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా నాకైతే ఎక్కడా కనబళ్ళేదు. పక్క వీధిలో ఇళ్ళు నిప్పంటుకున్నాయని తెలిసినప్పుడైనా మన చూరు మీదా నీళ్ళు చల్లుకోకుండా కూర్చుంటే ... ఇదిలా ఉండగా 40,000 సైన్యం అదనంగా కావాలని అడిగారుట ఆఫ్ఘనిస్తానులో నేటో సైన్యాధ్యక్షుడు. సాధారణ ప్రజలు ఎలా ఉంటున్నారో, ఏమి అల్లాడి పోతున్నారో .. ఇంతలో చలికాలం రానున్నది. ఎనిమిదేళ్ళయింది అమెరికా తొలి దాడులు జరిపి ..
తుంగభద్ర, కృష్ణ వరదల నేపథ్యంలో, జీమెయిలు చాట్లో ఎవరన్నా ఇండియా స్నేహితులు కనబడి చాట్లో చెబితే తెలిసిన వివరాలు తప్ప, ఆన్లైన్ పత్రికల్లో కానీ, పదే పదే ఎప్పటికప్పుడు యూట్యూబులో అప్లోడ్ అవుతూ ఉండిన టీవీ వార్తా ఛానెళ్ళ ప్రసారాలు కానీ ఒక్క పనికొచ్చే వార్త చెప్పలేదు. ఈ సందర్భంగా బ్లాగుల్లో టీవీ ఛానెళ్ళ తాండవాన్ని మన వాళ్ళు బాగానే విమర్శించారు. అదలా ఉండగా, వార్తా పత్రిక గానీ, వార్తా ఛానెల్ గానీ, ఒక పద్ధతి ప్రకారం కవరేజ్ ఇవ్వనక్కర్లేదా? ఉదాహరణకి, ఈనాడో, ఆంధ్ర జ్యోతో తెరిస్తే, కనీసం ఒక అరగంట వెతుక్కోవాలి, కృష్ణ వెంబడి పలాని వూర్లో పరిస్థితి ఎలాగుందో అని తెలుసుకోవడానికి. కృష్ణ ప్రవహించే మార్గం తెలిసినదే. దాన్ని ఒక మేప్ గా ఇచ్చి, దాన్నించి వివిధ ప్రాంతాల వివరాల్ని ఇవ్వచ్చు. ఇంకా చాలా రకాలుగా సమర్ధవంతంగా ఇవ్వచ్చు. ఈ సందర్భంగా వార్తా మాధ్యమాల పూర్తి ఫెయిలయ్యాయని భావిస్తున్నాన్నేను. సరే, వరద తగ్గు మొగం పట్టిందని చదివి, హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని పోనీ మన మేధావులేమని విశ్లేషిస్తున్నారో అని ఆంధ్రజ్యోతి సంపాదకీయం తీస్తే, ప్రధాన సంపాదకుడు కే. శ్రీనివాస్ గారు, ఏంటో తలా తోకా లేకుండా .. ఋగ్వేదం నించి కొటేషన్లు చెబుతూ .. ఆయన తెలివినంతా కుమ్మరించింది చదివేప్పటికి నాకు తిక్క నసాళం అంటుకుంది.
ఉట్టుడియంగా ఒబామాకి నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారు. ఈ నార్వీజియన్లకి చదవేస్తే ఉన్నమతి పోతున్నట్టుంది :) నేను ఒబామా అభిమానినే గానీ, ఇది మాత్రం టుమ్మచ్ అనిపించింది. ఆయన సున్నితంగా తిరస్కరించే బావుణ్ణని కూడా అనుకున్నాను. కానీ హబ్బే మారీ బాగుండదేమో అని సిగ్గు పడుతూనే స్వీకరించేశాడు. బుష్షుగారు మిగతాప్రపంచం మీదంతా కత్తులు దూస్తూ వీరతాండవం చెయ్యనారంభించిన రోజునుంచీ, ఈ నార్వీజియన్లకి ఎట్లాగైనా అమెరికన్ల దిమ్మతిరిగేలా ఒక్క చెంపపెట్టు పెట్టాలని వాళ్ళకి చేతులు తిమ్మిరి తిమ్మిర్గా ఉన్నాయనీ, ఒబామాకి శాంతి నోబెలు నిచ్చేసి ఆ తిమ్మిరి తీర్చేసుకున్నారనీ నాకో గాట్ఠి అనుమానం. అసలే మనిషి అందర్నీ కలుపుకు పోవాలీ, ఎక్కడా మాట తొణక్కూడదూ అన్నట్టు ఆచి తూచి అడుగేస్తుంటాడు .. ఇహ ఇంత గౌరవం చేసేశాక, ఇంక మరీ జాగ్రత్త పరుడైపోతాడేమో అని నా భయం. ఎందుకంటే, రాజకీయం, జాతీయంగానైనా, అంతర్జాతీయంగానైనా ఏదన్నా ముఖ్యమైన విజయం సాధించాలంటే కొంచెం తెగింపు ఉండాలి. ఇతగాడు సాధించాల్సిన ఘనకార్యాలెన్నో ఉన్నాయి. ఈ బహుమతి ఏదో ఆయనకి గర్వంతో కళ్ళు నెత్తిమీదికి తెస్తుందనే భయం లేదు కాని, ఈయన జాగ్రత్త విపరీతం ఐపోతుందని మాత్రం నాకు భయంగా ఉంది. టైం పత్రిక విలేకరి జో లైన్ తనబ్లాగులో నా భావాల్ని సరిగ్గా పట్టుకున్నాడు.
